BJP నేతలు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇప్పించి మాట్లాడాలి

BJP నేతలు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇప్పించి మాట్లాడాలి

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవడం బీజేపీకి మింగుడుపడటం లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్… కేంద్రం నిధులివ్వకున్నా సొంతంగా ప్రాజెక్ట్ నిర్మించామన్నారు. 4 సీట్లు గెలవగానే బీజేపీ ఎగిసిపడుతుందన్న మంత్రి.. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇప్పించి మాట్లాడాలన్నారు. విమర్శలు మానుకొని.. రాష్ట్రానికి నిధులు సాధించడంపై బీజేపీ దృష్టి పెట్టాలని సూచించారు.