జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం : మంత్రి తలసాని 

జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం : మంత్రి తలసాని 

సికింద్రాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో జనావాసాల మధ్య ఉన్న గోదాములను మరో చోటకు తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ ప్రాంతాన్ని మంత్రి తలసాని సందర్శించారు. మరో రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్పారు. బిల్డింగ్ పరిసరాల్లోని ఇండ్లకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూల్చివేయించామని తెలిపారు. గోదాముల యజమానులు నిబంధనలు, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే పలుచోట్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.