సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి తలసాని ఫిర్యాదు

సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి తలసాని ఫిర్యాదు

బోనాల వేడుక సందర్భంగా  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సాహంతో డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి మద్యం సేవించి డ్యాన్స్ చేశారని కొందరు నెటిజెన్ల సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు.

అసలు తనకు మందు అలవాటు లేదని… ప్రతి ఏడాది బోనాలకు డ్యాన్స్ చేస్తానని తెలిపారు మంత్రి తలసాని. ఆడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తలసాని తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్స్ చేయగా, ‘మందుబాబులం మేము మందుబాబులం’ అనే పాటకు డ్యాన్స్ చేసినట్టుగా ఓ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది. మంత్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.