తెలంగాణలో ఆస్తులమ్ముకుని చంద్రబాబు ఏపీ పోవాలి

తెలంగాణలో ఆస్తులమ్ముకుని చంద్రబాబు ఏపీ పోవాలి

చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో పోలింగ్ ఎంత అనేది ఒకరోజు తర్వాతే తెలుస్తుందని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోతారనీ.. ఆయన పొంతన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. డ్రామాలు చేయడంలో మంగళగిరి లో లోకేష్ వాళ్ళ నాన్నని మించి పోయాడని విమర్శించారు.

“చంద్రబాబు నీతి పరుడైతే తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని ఏపీలోనే వుండాలి. అస్తులున్నవాల్లని టీఆర్ఎస్ బెదిరించింది అని ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఏపీలో చంద్రబాబు ప్రచారం చూసి తెలంగాణ టీడీపీ నేతలకు సిగ్గు వచ్చి ఉంటుంది. చంద్రబాబు నిజాయితీ పరుడైతే ఎన్నికల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని కాణిపాకం గుడి వద్దకు వచ్చి పిల్లలపై ఒట్టు వేయాలి” అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

చంద్రబాబు ఓ చిల్లరగాడు

“హెరిటేజ్ లో పాలు, పెరుగు, కూరగాయలు అమ్మి రూ.1500 కోట్లు సంపాదించారా..? నిన్న మొన్న పుట్టిన మనవడి బ్యాంక్ లో రూ.80 కోట్లు ఎలా ఉంటాయి? అవినీతికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. పరిపాలన చేతకాదు.. ఎన్నికల కోసం పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలు తెచ్చారు. జగన్ హైదరబాద్ లో వుంటే నీకేం నొప్పి. ఓడిపోయాక చంద్రబాబు హైదరాబాద్ కే వస్తాడు. ఆయనకు ఏపీలో దిక్కు లేదు. చంద్రబాబు ఎలాగూ ఓడిపోతాడు కాబట్టి ఈవీఎంలపై నెపం వేస్తున్నాడు. చంద్రబాబు చిల్లర గాడు. చంద్రబాబు అబద్ధాలు చెప్పకపోతే టీడీపీ అభ్యర్థులకు నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చేవి. 18 కేసుల్లో స్టే తెచ్చుకొని పత్తిత్తులా మాట్లాడుతున్నాడు. జగన్ కు టీఆర్ఎస్ డబ్బులు పంపిందా..? రెండు వేల నోట్లు, మూడు వేల రూపాయల నోట్లు ఇచ్చారని అంటున్నారు. 3 వేల రూపాయల నోటు కూడా వుందా ఎక్కడైనా? రూ.1600 కోట్లు మీ కుటుంబం దగ్గర వుంటే పేదరికం యెట్లా దూరం అవుతుంది?” అని ప్రశ్నించారు తలసాని.