రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు: మంత్రి తలసాని

రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు: మంత్రి తలసాని

హైదరాబాద్ సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఎర్రగడ్డ చౌరస్తా నుంచి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్రగా నడిచి రోడ్డును పరిశీలించారు. 

రోడ్ల ఆక్రమణతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తలసాని తెలిపారు. రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలను తొలగించి ఈ నెలాఖరులోగా  సనత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఎర్రగడ్డ వరకు రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లన్నీ ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులకు మంత్రి సూచించారు.