సికింద్రాబాద్ లోని పలు  కాలనీల్లో మంత్రి తలసాని పర్యటన

సికింద్రాబాద్ లోని పలు  కాలనీల్లో మంత్రి తలసాని పర్యటన

సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా బస్తీలు, కాలనీల్లో పర్యటనలు చేపట్టినట్టు తెలిపారు. అందులో భాగంగా బన్సీలాల్ పేట డివిజన్ గాంధీనగర్ లో అధికారులు, స్థానిక కార్పొరేటర్ కుర్మ హేమలత తో కలిసి మంత్రి తలసాని పర్యటిస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పార్కులు, చిల్డ్రన్స్ ప్లే గార్డెన్స్ ను పరిశీలించి అందులో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తను వెంటనే క్లీన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని  సూచించారు. 

కాలనీలు, బస్తీల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.