దేశానికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శం
ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం
హుజూర్ నగర్ ఉపఎన్నికలలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. దీంతో టీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పరిపాలనను మెచ్చి హుజూర్ నగర్ ప్రజలు లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నారని అన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. దేశానికి మోడల్ కేసీఆర్ ప్రభుత్వమని తెలిపారు.