క్రిస్మస్ గిఫ్ట్ లను పంపిణీ చేసిన మంత్రి తలసాని

క్రిస్మస్ గిఫ్ట్ లను పంపిణీ చేసిన మంత్రి తలసాని

సికింద్రాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రైస్తవ కుటుంబాలకు  క్రిస్మస్ గిఫ్ట్ లను పంపిణీ చేశారు. ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. పండుగ పూట పేదలు సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గిఫ్ట్ ల పంపిణీతోపాటు గొప్ప విందును ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

చర్చిలు, గ్రేవీ యార్డ్ ల అభివృద్ధి కి అత్యధిక నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు.