మీ కంటే మేము పది రెట్లు ఎక్కువ బలవంతులం

మీ కంటే మేము పది రెట్లు ఎక్కువ బలవంతులం

ఎన్నికల సమయంలో పోలీస్ లు సోదాలు చేయటం కామన్ అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. TRS పార్టీ లీడర్ల ఇళ్లల్లో కూడా పోలీస్ లు సోదాలు చేశారన్నారు. మీ కెపాసిటీ ఎంత, మీ సంఖ్య ఎంత.. ముట్టడి చేస్తాం ..ధర్నా చేస్తామని అంటే..మేము కూడా  అలా అన్నమనుకో ఒకసారి ఇమాజిన్ చేసు కోండి.. ఎలా వుంటుందో..మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారన్నారు. కేంద్రంలో మా ప్రభుత్వం ఉందని సోదాలు చేయకూడదని అంటే ఎట్లా..బీజేపీ ముఖ్య నేతలు అక్కడ ఏమి జరిగిందో వాస్తవాలు తెలుసుకొని పోవాలి కదా అన్నారు.

దుబ్బాకలో మంత్రి హరీష్ రావు తప్ప ఒక్క నేత అయినా ఉన్నాడా.. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధులలో కేంద్రం పైసలు ఉన్నాయని చెబుతున్నారు.. మీరు చెప్పింది నిజమైతే మీ కేంద్రం నుంచి ఒక్క అధికారిక లేఖ తీసుకురండన్నారు. హైదరాబాద్ లో వరదలు వస్తే కేంద్ర టీం వచ్చి పోయి నాలుగు రోజులు అయ్యింది. ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఇది బలుపు కాదా.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్న తలసాని.. మీ కన్నా నాలుగు ఆకులు ఎక్కువగానే చదివినం అన్నారు.

బీజేపీకి ఉన్న కార్యకర్తలు ఎంత మంది..బండి సంజయ్ ను ఎందుకు అధ్యక్షుడు చేసిండ్రో అర్థం కావటం లేదన్నారు. నోటికి ఎది వస్తే అదే మాట్లాడుతున్నారని..బీజేపీకి దుబ్బాకలో రెండు సార్లు డిపాజిట్ రాలేదని… మీరు మాకు పోటీ ఎట్లా అవుతారన్నారు. ముట్టడి చేసుకుందాం అంటే మేము కూడా రెడీ రండి.. మర్యాదగా ఉంటే మంచిది.. మీ కంటే మేము పది రెట్లు ఎక్కువ బలవంతులమన్నారు.

బండి సంజయ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచీ ఆయన బిహేవియర్ ఎట్లా ఉంది.. ఎంపీ పైన పోలీస్ లు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా… బీజేపీ వాళ్లకు ఇదే ఫైనల్ వార్నింగ్ .. మీరు మమ్మల్ని తిడితే.. మేము మీ ప్రధాని కెళ్ళి స్టార్ట్ చేస్తామన్నారు. ఢిల్లీలో గవర్నమెంట్ ఉంటే ఏమి చేస్తారు.. మీకు బయటపడేందుకు ఇక్కడ అమాయకులు ఎవరు లేరన్నారు తలసాని.