టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ బహిరంగ సభలో తలసాని మాట్లాడుతూ మరికొద్దిరోజుల్లో జరిగే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఎత్తున విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసిన ఓటర్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను 104 స్థానాల్లో గెలిపిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు.