తెలంగాణకు టీఆర్ఎస్  శ్రీరామరక్ష

తెలంగాణకు టీఆర్ఎస్  శ్రీరామరక్ష

తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్  శ్రీరామరక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  అన్నారు. పార్టీ  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలసాని శ్రీనివాస్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో ముఖ్యంగా కరెంటు,సాగు, త్రాగు నీళ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో  తీసుకెళ్తున్నారన్నారు. ఇప్పటి కే ఉన్న సమస్యలను కొన్ని సాధించుకోవడం జరిగిందని,మిగిలి ఉన్న పనులను కూడా రానున్న రోజులల్లో పూర్తీ చేసుకుంటామన్నారు. కరోనా కారణాంగా కొంత ఇబ్బంది ఉన్నా..ప్రజలు కరోనా బారిన పడకుండా నిత్య జీవితంలోకి త్వరగా రావాలని కోరారు.