
సూర్యాపేట, వెలుగు : రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని నీటిపారుదల పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేటలో రూ.7.61 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా విద్యుత్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, టీజీఎస్ఎస్టీసీఎల్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం ఎక్కువగా సాగు చేస్తున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, ఆర్డీవో వేణుమాధవ్, ఈఈ కృష్ణారెడ్డి, డీఈ శ్రీనివాసులు, తహసీల్దార్ కృషయ్య, అధికారులు పాల్గొన్నారు.