హుజూర్ నగర్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడుకు చెందిన బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు జోగు అరవింద్ రెడ్డితోపాటు 50 మంది నాయకులు శనివారం కాంగ్రెస్లో చేరారు. వారికి హైదరాబాద్లో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
