
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏ మాత్రం జాప్యం చేయొద్దని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జూన్ 27న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. లబ్ధిదారులు ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత త్వరగా అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పారు. బిల్లులు రావు అనే భయంతో ఉండకూడదన్నారు. లబ్ధిదారులు నిర్భయంగా ఇళ్లు కట్టుకోవాలని సూచించారు. తన ఇళ్లు, ఆస్తులు అమ్మి అయినా సరే లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు.
మాజీ మంత్రులు జూరాలపై ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. జూరాలకు 2009లో 12 లక్షల క్యూసెక్కుల నీరు వదిలిన ఎవరికి నష్టం జరగలేదు. ఏ గ్రామం కూడా మునగలేదు. 2014-15లో రోప్ లు తెగిన ఎవరు మాట్లాడలేదు. ప్రస్తుతం 8 రోఫ్ లు తెగినవి 4 గేట్లు మరమ్మతులు చేశాం. ముందస్తు వరద కారణంగా ఇంకా మరో 4 మరమ్మతులకు ఆటంకం కలిగింది. జూరాల డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ. డ్యాంకు వెళ్ళే రోడ్డు కూడా వేసింది కాంగ్రెస్ పార్టీనే. 2017 లో 51 రోఫ్ లు మార్చినారు అప్పుడే ఏమి ప్రమాదం జరగలేదు. ఈ రోఫ్ లు మరమ్మతులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ హాయంలోనే అన్ని ప్రాజెక్టులు నిర్మించాం. కాంగ్రెస్ పార్టీ హాయంలో నిర్మించిన ప్రాజెక్టులు 400 సంవత్సరాలు అయినా కూడా ఇంకా భద్రతగానే ఉన్నాయి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లరు కుంగిపోయినా డ్యాంకు ఏమి కాలేదని కేసీఆర్ కేటీఆర్ అంటున్నారు
10 సంవత్సరాల నుంచి సంగబండ డ్యాంకి గేట్లకు గ్రీసు కూడా పెట్టలేదు. సంగంబండ 18 ఎండ్లనుంచి వెనక పడింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అడ్డుగా ఉన్న బండను పగులగొట్టి పునరావాస బాధితులకు నష్టపరిహారం డబ్బులు ఇప్పించాం. నేను గెలిచిన 18 నెలలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం అని మంత్రి వాకిటి వ్యాఖ్యానించారు.