
శివ్వంపేట, వెలుగు: గజ్వేల్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ కు హాజరైన మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామిని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి, నాయకులు నవీన్ గుప్తా ఘనంగా సన్మానించారు. అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
శివ్వంపేట మండలానికి 50 పడకల ఆస్పత్రి, ఓ అంబులెన్స్ కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, గణేశ్, రాజు గౌడ్, అరుణ్ కుమార్ ఉన్నారు.