గజ్వేల్‌లో మంత్రి వివేక్ వెంకట స్వామికి సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గజ్వేల్‌లో మంత్రి వివేక్ వెంకట స్వామికి సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

శివ్వంపేట, వెలుగు: గజ్వేల్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ కు హాజరైన మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామిని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి రాజిరెడ్డి,  నాయకులు నవీన్ గుప్తా ఘనంగా సన్మానించారు. అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

 శివ్వంపేట మండలానికి 50 పడకల ఆస్పత్రి, ఓ అంబులెన్స్ కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, గణేశ్,  రాజు గౌడ్, అరుణ్ కుమార్ ఉన్నారు.