- నేడు మందమర్రి, చెన్నూరులో ఫ్రీ కోచింగ్సెంటర్లను ప్రారంభించనున్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న యువతీయువకులకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేందుకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని మందమర్రి, చెన్నూరు పట్టణాల్లో ఫ్రీ కోచింగ్సెంటర్లను ఏర్పాటు చేశారు. చెన్నూరు మున్సిపాలిటీలోని మహిళా భవన్, మందమర్రిలోని తహసీల్దార్ఆఫీస్ఎదుట ఉన్న భవనం(షెడ్డు)లో ఏర్పాటు చేసిన కోచింగ్సెంటర్లను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ప్రారంభించనున్నారు. సుమారు మూడు నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.
