
గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రిగా నియమితులైన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని గోదావరిఖనికి చెందిన కాంగ్రెస్ లీడర్లు గురువారం హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో పి.మల్లికార్జున్, పాకాల గోవర్ధన్రెడ్డి, కామ విజయ్, కోరం నరేందర్ రెడ్డి, నర్సింగ్దొర, తిప్పారపు మధు, మాదాసు విజయ్, మునుకుంట్ల రాకేశ్, సుతారి దినేశ్, విజయ్, శ్రీనివాస్,
రౌతు శ్రీకాంత్, తదితరులున్నారు.
వివేక్కు మంత్రి పదవి రావడం హర్షణీయం
ముస్తాబాద్, వెలుగు: బడుగుల ఆశాజ్యోతి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం హర్షణీయమని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో వివేక్ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా ఆశయ సాధనలో వివేక్ వెంకటస్వామి ముందుకు వెళ్తున్నారన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో వివేక్ వెంకటస్వామి చేసిన సేవలు మరువలేనివి అన్నారు. మీడియా ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.
సిరిసిల్ల మాల జేఏసీ లీడర్లు..
రాజన్న సిరిసిల్ల, వెలుగు: మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని జిల్లా మాల ఐక్యవేదిక నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మంత్రి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు తుంగ శివరాజ్ మాట్లాడుతూ మాలసామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కల్పించడం స్వాగతించాల్సిన విషయమన్నారు. ఆయన వెంట మాల ఐక్యవేదిక కన్వీనర్లు జక్కుల యాదగిరి, బూర యాదగిరి ఉన్నారు.