మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం

కోల్​బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి ఫ్యామిలీ అంటేనే గౌరవం గల కుటుంబమని,పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గంలో నాలుగు దశాబ్దాలుగా కార్మికవర్గానికి సేవలు అందిస్తున్నారని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు​వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. ఆదివారం మందమర్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఏఐటీయూసీ మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి బ్రాంచ్​ ఆధ్వర్యంలో రాష్ట్ర గనులు, కార్మికశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్తే, రుణం మంజూరు చేయించి కాపాడిన ఘనత కాకా వెంకట స్వామికి దక్కుతుందన్నారు. కార్మికులకు పెన్షన్​ స్కీం తీసుకువచ్చారని, ఆయనసేవలను సింగరేణి కార్మికులు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు. కేంద్ర మంత్రిగా కాకా పని చేస్తే. ఆయన కొడుకులు వివేక్​ వెంకటస్వామి, గడ్డం వినోద్​ రాష్ట్ర కార్మిక మంత్రులుగా పని చేయడం కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు దోహదం చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, సీనియర్​ కార్మిక నేత బాబర్​ సలీం పాషా, వీరభద్రయ్య, సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్​అలీ, ఎస్కే బాజీసైదా, దాగం మల్లేశ్​ పాల్గొన్నారు. 

మంత్రిని కలిసిన కలెక్టర్, సీపీ..

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామిని మంచిర్యాల హైటెక్​ సిటీ కాలనీ లోని ఆయన నివాసంలో మంచిర్యాల కలెక్టర్​ కుమార్​ దీపక్, రామగుండం పోలీస్  కమిషనర్  అంబర్ కిశోర్​ ఝా, డీసీపీ భాస్కర్​ మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పీఆర్టీయూ టీఎస్​ లీడర్లు, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు, ఆఫీసర్లు, ఉద్యోగులు, రాజకీయ, కార్మిక సంఘాలు, వివిధ కుల, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు మంత్రిని సన్మానించారు.

 మందమర్రి పట్టణానికి చెందిన అఖిలేశ్​​రోడ్డు ప్రమాదంలో గాయపడగా, మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆయన చికిత్స కోసం రూ.1.80 లక్షల ఎల్ఓసీ అందించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లాకు చెందిన కాంగ్రెస్​ లీడర్ శ్రీధర్​ పటేల్​ బర్త్​డే సందర్భంగా మంత్రి కేక్​ కట్​ చేసి 
విషెస్​ తెలిపారు.