
కోల్బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి ఫ్యామిలీ అంటేనే గౌరవం గల కుటుంబమని,పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు దశాబ్దాలుగా కార్మికవర్గానికి సేవలు అందిస్తున్నారని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడువాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. ఆదివారం మందమర్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏఐటీయూసీ మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో రాష్ట్ర గనులు, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్తే, రుణం మంజూరు చేయించి కాపాడిన ఘనత కాకా వెంకట స్వామికి దక్కుతుందన్నారు. కార్మికులకు పెన్షన్ స్కీం తీసుకువచ్చారని, ఆయనసేవలను సింగరేణి కార్మికులు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు. కేంద్ర మంత్రిగా కాకా పని చేస్తే. ఆయన కొడుకులు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ రాష్ట్ర కార్మిక మంత్రులుగా పని చేయడం కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు దోహదం చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, సీనియర్ కార్మిక నేత బాబర్ సలీం పాషా, వీరభద్రయ్య, సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్అలీ, ఎస్కే బాజీసైదా, దాగం మల్లేశ్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన కలెక్టర్, సీపీ..
రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాల హైటెక్ సిటీ కాలనీ లోని ఆయన నివాసంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పీఆర్టీయూ టీఎస్ లీడర్లు, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు, ఆఫీసర్లు, ఉద్యోగులు, రాజకీయ, కార్మిక సంఘాలు, వివిధ కుల, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు మంత్రిని సన్మానించారు.
మందమర్రి పట్టణానికి చెందిన అఖిలేశ్రోడ్డు ప్రమాదంలో గాయపడగా, మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన చికిత్స కోసం రూ.1.80 లక్షల ఎల్ఓసీ అందించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ పటేల్ బర్త్డే సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి
విషెస్ తెలిపారు.