చెన్నూరులో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం ప్రారంభం
కోల్బెల్ట్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చెన్నూరు పట్టణంలో రూ.20 లక్షల డీఎంఎఫ్టీ ఫండ్స్తో నిర్మించిన అంబేద్కర్కమ్యూనిటీ భవనాన్ని కలెక్టర్ కుమార్దీపక్, దళిత సంఘాల లీడర్లతో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 ఏండ్లుగా అంబేద్కర్ భవనం కోసం చెన్నూరు దళితులు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని, ఇప్పుడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
భవనాన్ని ఎక్స్టెన్షన్ చేసేందుకు మరో రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. భీమారంలో అంబేద్కర్ భవనం, జైపూర్లో జగ్జీవన్రాం భవనం, చెన్నూరులో ముదిరాజ్భవనాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. స్థలాలు ఉంటే అన్ని కుల సంఘాలకు అవసరమైన భవనాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.50కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు లోని నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ను తొలగించిన కొత్త వారితో పనులు చేయించాలని కలెక్టర్, మున్సిపల్ఆఫీసర్లను ఆదేశించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న పబ్లిక్ హెల్త్ డీఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులపై చెన్నూరు మున్సిపల్ఆఫీస్లో కలె క్టర్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో రివ్యూ నిర్వహించారు
