
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. గంట సమయంలో ఇంత మంది కార్యకర్తలుఈ సమావేశానికి రావడం చూస్తే కాంగ్రెస్ జోష్ ఏంటో అర్థమవుతోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎఎస్ కార్యకర్తలు పదేళ్ళలో కమీషన్ ల తో బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందన్నారు వివేక్. పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో సమస్యలు కనుక్కుని వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించాలన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటాలి. అన్ని పార్టీలలో గ్రూపులు ఉండడం సాధారణం. మనకు ఇప్పడు వన్ పాయింట్ ఎజెండాతో ముందుకు పోవాలి. ఇందిరమ్మ ఇండ్ల గురించి అందరు బాగా మాట్లాడుకుంటున్నారు. సన్న బియ్యం బోనస్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మన కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి స్ట్రాంగ్ చేయాలి.బీఆర్ఎస్ సోషల్ మీడియాను చిల్లరగా వాడు కుంటుంది. మనం పాజిటివ్ గా సోషల్ మీడియాను వాడుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలయ్యే చూడడంతో పాటు ప్రజలకు అర్థం అయ్యేలా చూడాలి. విభేదాలు వీడి అందరు కలిసి పనిచేయాలి. కాకా వెంకటస్వామిని అప్పట్లో సిద్దిపేట,గజ్వేల్ నియోజకవర్గాల ప్రజలు ఆదరించారు అని మంత్రి వివేక్ అన్నారు.