ముంబై : మైనర్ను పెళ్లి చేసుకుని, గర్భవతిని చేసిన వ్యక్తిపై ముంబై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. మైనార్టీ తీరకుండానే పెళ్లి జరిపించిన తల్లి, అబ్బాయి పేరెంట్స్ లనూ బుక్ చేశారు. ముంబై జేజే హాస్పిటల్లో బాలిక ఇటీవల డెలివరీ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అగ్రిపాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లికి పోషించే స్తోమత లేక, కిందటేడాది అదేప్రాంతానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేసింది. తర్వాత బిడ్డను కాపురానికి పంపించింది. ఈ క్రమంలో గర్భం దాల్చిన బాలిక.. జేజే హాస్పిటల్లో ఇటీవలె బిడ్డకు జన్మనివ్వగా డాక్టర్లు బాలిక వయసుపై ఆరా తీశారు. 20 ఏండ్లని అత్తమామలు చెప్పగా.. ఆధార్ కార్డులో 2006లో పుట్టినట్లు ఉంది. దీంతో వాళ్లు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. బాలిక తల్లి, భర్త, అత్తమామలతో పాటు పెళ్లి చేసిన మతపెద్దలపై పోలీసులు కేసు పెట్టారు.
మైనర్ ను పెళ్లాడి గర్భవతి చేసిన వ్యక్తిపై కేసు
- దేశం
- December 23, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- పారిస్ ఒలింపిక్స్కు మన శ్రీజ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్