మైనర్ ను పెళ్లాడి గర్భవతి చేసిన వ్యక్తిపై కేసు

మైనర్ ను పెళ్లాడి గర్భవతి చేసిన వ్యక్తిపై కేసు

ముంబై : మైనర్​ను పెళ్లి చేసుకుని, గర్భవతిని చేసిన వ్యక్తిపై ముంబై పోలీసులు రేప్​ కేసు నమోదు చేశారు. మైనార్టీ తీరకుండానే పెళ్లి జరిపించిన తల్లి, అబ్బాయి పేరెంట్స్ లనూ బుక్​ చేశారు. ముంబై జేజే హాస్పిటల్​లో బాలిక ఇటీవల డెలివరీ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అగ్రిపాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లికి పోషించే స్తోమత లేక, కిందటేడాది అదేప్రాంతానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేసింది. తర్వాత బిడ్డను కాపురానికి పంపించింది. ఈ క్రమంలో గర్భం దాల్చిన బాలిక.. జేజే హాస్పిటల్​లో ఇటీవలె బిడ్డకు జన్మనివ్వగా డాక్టర్లు బాలిక వయసుపై ఆరా తీశారు. 20 ఏండ్లని అత్తమామలు చెప్పగా.. ఆధార్​ కార్డులో 2006లో పుట్టినట్లు  ఉంది. దీంతో వాళ్లు పోలీసులకు ఇన్ఫామ్​ చేశారు. బాలిక తల్లి, భర్త, అత్తమామలతో పాటు పెళ్లి చేసిన మతపెద్దలపై పోలీసులు కేసు పెట్టారు.