సర్కార్ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి : తారీఖ్ అన్సారీ

సర్కార్ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి :  తారీఖ్ అన్సారీ
  • మైనార్టీ కమిషన్​ చైర్మన్​ తారీఖ్​ అన్సారీ

నిజామాబాద్​, వెలుగు: అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ హాస్పిటల్స్ తలుపుతట్టే పేదలకు డాక్టర్లు బాసటగా ఉండి నమ్మకం పెంచాలని స్టేట్​ మైనార్టీ కమిషన్​ చైర్మన్ తారీఖ్ అన్సారీ సూచించారు. సోమవారం ఆయన నగరంలోని జీజీహెచ్​ను​ విజిట్​ చేసి వార్డులు తిరిగారు.  తర్వాత డాక్టర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ఇస్తున్న ప్రయారిటీని గుర్తించాలని, కావాల్సిన మెడిసిన్స్​ ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలన్నారు. జీజీహెచ్​, మెడికల్​ కాలేజీ నిర్వహణపై తనకు డిటైల్​ రిపోర్టు ఇవ్వాలని కోరారు. సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాస్​రావు, కాలేజీ ప్రిన్సిపాల్​ డాక్టర్​ కృష్ణమోహన్​ తదితరులు ఉన్నారు.