మిర్చికి రికార్డు ధర

మిర్చికి రికార్డు ధర

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం ఏఎంసీ మార్కెట్ లో సోమవారం మిర్చికి రికార్డు ధర పలికింది. సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ రుద్రాక్ష మల్లేశం, చైర్మన్​ డౌలే లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో జెండా పాట నిర్వహించగా తేజ ఏసీ మిర్చి క్వింటా ధర రూ.23,500 పలికింది. మార్కెట్ యార్డుకు 2 వేల బస్తాలు వచ్చాయని అధికారులు చెప్పారు. 15 వతేదీన తేజ ఏసీ రకానికి రూ.23 వేలు పలకగా మూడు రోజుల్లోనే మరో రూ.500 పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.