శ్రీశైలం నిత్యాన్నదాన సత్రంలో పేలిన బాయిలర్

శ్రీశైలం నిత్యాన్నదాన సత్రంలో పేలిన బాయిలర్

కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీశైలం దేవస్థానం నిత్యాన్నదాన భవనంలో మరోసారి వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలింది. అన్నదాన సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాయిలర్ పేలినట్టు తెలుస్తోంది. దీంతో ఉద్యోగ సిబ్బంది, భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిత్యాన్నదాన భవనం బయట వైపు పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పినట్టు అధికారులు గుర్తించారు. బాయిలర్ లో వేడి ఎక్కువ కావడంతోనే ఆ  ప్రెజర్ కు పేలినట్లు సిబ్బంది చెబుతున్నారు. అయితే పేలుడు సంభవించిన సమయంలో చుట్టుపక్కల వేడి నీళ్లు పడడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సంఘటనా స్థలానికి నుంచి దేవస్థానం ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అక్కడికి చేరుకున్న దేవస్థానం అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.