జూన్ 2న రాజ్​భవన్​కు మిస్​ వరల్డ్ సుచాత

జూన్ 2న రాజ్​భవన్​కు మిస్​ వరల్డ్ సుచాత

హైదరాబాద్, వెలుగు: మిస్​ వరల్డ్ ఓపల్​ సుచాత చువాంగ్​శ్రీ సోమవారం రాజ్​భవన్​కు వెళ్లనున్నారు. ఆమెతోపాటు రన్నరప్స్​ ఆరేలి జాచిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మయా క్లైడా, హాసెట్​ డెరెజే కూడా గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మను కలవనున్నారు. మిస్​ వరల్డ్​ జర్నీని గవర్నర్​తో పంచుకోనున్నారు. హైదరాబాద్​ వేదికగా నిర్వహించిన మిస్​ వరల్డ్​ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. ఇందులో థాయ్​లాండ్​ సుందరి ఓపల్​ సుచాత కిరీటాన్ని దక్కించుకున్నారు. రాజ్​భవన్​లో వీరికి తేనీటి విందు ఇవ్వనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.  

స్వదేశాలకు పయమైన బ్యూటీస్​

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు స్వదేశాలకు తిరుగు పయనమయ్యారు. ఆదివారం ఒక్కరోజే  67 దేశాలకు చెందిన సుందరీమణులు వెళ్లారు. వీరికి ఎయిర్ పోర్టులో టూరిజం అధికారులు వీడ్కోలు పలికారు. బోట్స్వానా, కజకిస్తాన్, గినియా, జమైకా, కామెరూన్, బెలిజ్, కొలంబియా, జింబాంబ్వే, జపాన్, ఫ్రాన్స్ దేశాల కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందాల భామలు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తెలంగాణ జరూర్​ఆనా’ అంటూ నినదించారు.