
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా యంగ్ షట్లర్ మిథున్ మంజునాథ్ సంచలన విజయం సాధించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్లో తొలి రౌండ్లో మిథున్ 21–19, 21–19తో మాజీ వరల్డ్ చాంపియన్, నాలుగో సీడ్లో కీన్ యెవ్ (ఇండోనేసియా)కు షాకిచ్చి ప్రిక్వార్టర్స్ చేరాడు. ఇతర మ్యాచ్ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–18, 21–7తో కెంటా నిషియోటో (జపాన్)పై, ఆరోసీడ్ ప్రణయ్ 21–18, 16–21, 21–15తో లీ చుక్ యియు (చైనా)పై, రజావత్ 21–12, 21–16తో నాథన్ టాంగ్ (ఆస్ట్రేలియా)పై గెలవగా, కిరణ్ జార్జ్తో మ్యాచ్లో 5–0 స్కోరు వద్ద లక్ష్యసేన్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో ఐదోసీడ్ సింధు 21–18, 21–13తో ఇండియాకే చెందిన అష్మితా చాలిహాపై గెలిచింది. ఆకర్షి కశ్యప్, మాళవిక, తస్నిమ్ తొలి రౌండ్లోనే ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్–సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీలకూ చుక్కెదురైంది.