
నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ మరువలేని సేవలు అందించారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్భూపతిరెడ్డి అన్నారు. సోమవారం డి.శ్రీనివాస్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని కంఠేశ్వర్ చౌరస్తాలో డీఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డితో కలిసి నివాళులర్పించారు. డీఎస్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుతీసుకెళ్తామని తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, పొలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పుట్టింది, శ్వాస వీడింది కాంగ్రెస్లోనే..
ఏపీసీసీ ప్రెసిడెంట్గా డి.శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమని గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్అలీ అన్నారు. ఆయన కాంగ్రెస్లో పుట్టి అక్కడే తుదిశ్వాస వీడారన్నారు. సోమవారం డీఎస్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని కంఠేశ్వర్ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి నివాళులర్పించారు.
అప్పులు భరిస్తూ హామీల అమలు
బీఆర్ఎస్ సర్కార్ పదేండ్ల అప్పులు భరిస్తూ ప్రజలికిచ్చిన హామీలు అమలు చేస్తున్నామని షబ్బీర్అలీ అన్నారు. నగరంలోని నాందేవ్వాడ, టెలిఫోన్ కాలనీ, గోశాల, సతీష్నగర్, ఆటోనగర్ కాలనీకి చెందిన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. స్టేట్ కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు.