సంగారెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురిని కలిసి వినతిపత్రాలు అందించారు. తాగునీరు, రహదారుల రిపేర్, పెండింగ్ డెవలప్​మెంట్​పనులు, రైతుల సమస్యలను వారికి వివరించారు. ఫసల్వాది, కంది, ఇంద్రకరణ్, ఆరుట్ల గ్రామాల్లో ల్యాండ్​పూలింగ్​లో భూములు కోల్పోయిన రైతులకు రైతుబీమా, రైతు భరోసా రావడం లేదన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని విన్నవించారు.