ఇండ్లు మంజూరు చేయకుంటే దీక్ష చేస్తాం : ఎమ్మెల్యే ధన్పాల్

ఇండ్లు మంజూరు చేయకుంటే దీక్ష చేస్తాం : ఎమ్మెల్యే ధన్పాల్
  • అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​​

నిజామాబాద్, వెలుగు: అర్బన్ సెగ్మెంట్​లో మూడు నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుంటే నిరాహార దీక్ష చేస్తామని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు. గురువారం బీజేపీ జిల్లా ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్​ సర్కార్ నిర్మించి పంపిణీ చేయని డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు రిపేర్లు  చేసి పేదలకు కేటాయించాలన్నారు. 

ఇండ్ల నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్​ ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన స్కీం కింద ఆర్థిక సాయం అందుతున్నందున ప్రధాని మోదీ ఫొటో, పేరు ఇండ్లపై ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.  స్రవంతిరెడ్డి, లక్ష్మీనారాయణ, న్యావనంది గోపాల్ తదితరులు ఉన్నారు.