కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ  చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

ప్రభుత్వం పేద బిడ్డల పెళ్లిళ్ల కోసం కృషి చేస్తుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు వినోద్. బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల మండలాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు 2.33 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం 3 కోట్లతో నిర్మించిన బెల్లంపల్లి కన్నాల రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అండర్  బ్రిడ్జిలతో ప్రజలకు ఎంత సౌకర్యంగా ఉంటుందని వినోద్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, బిజెపి అసెంబ్లీ కన్వినర్ సంతోష్, పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్, ఎంపిటిసి సభ్యుడు మహేందర్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అమృత్ రైల్వే స్టేషన్ పథకం ప్రారంభోత్సవం ఎల్ఈడీలో తిలకించారు ఎమ్మెల్యే వినోద్.