- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 36వ క్రికెట్ ట్రోఫీని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం క్రీజ్లో బ్యాటింగ్ చేసి ఉత్సహపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడారంగానికి కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. మూడేళ్ల కింద రూ.7.50 కోట్లతో మైదానాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గత 36 ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఘనత మైత్రి క్రికెట్ క్లబ్ కి దక్కిందన్నారు.
రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, పారిశ్రామికవేత్తలు సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, సీఐ వినాయక్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత రెడ్డి, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నర్రా భిక్షపతి, ఇక్బాల్, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, వెంకటేశ్, ఎల్లయ్య, గిరి, సంజీవ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
