ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం :  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి చెప్పారు. ఆదివారం అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని బీరంగూడ ఇసుకబావిలోని మల్లన్న దేవాలయ ఆవరణలో గదులు, షెడ్​ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు వందలకు పైగా ఆలయాలు నిర్మించినట్లు చెప్పారు. అనంతరం స్థానిక నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. మున్సిపల్​మాజీ వైస్​ చైర్మన్​నర్సింహాగౌడ్, శ్రీనివాస్​రెడ్డి, తులసిరెడ్డి, దామోదర్​రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.