ఎమ్మెల్యేలను తిట్టడానికే షర్మిల పాదయాత్ర చేస్తుందా?

ఎమ్మెల్యేలను తిట్టడానికే షర్మిల పాదయాత్ర చేస్తుందా?

రాష్ట్రంలో వైఎస్ షర్మిల ఎందుకు పాదయాత్ర చేస్తుందో చెప్పాలని  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను తిట్టడానికేనా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ కు  తాను కోవర్టు కాదన్నారు.  ఏపీలో జగన్ పాదయాత్ర చేసి  సీఎం అయ్యాడని, షర్మిల తెలంగాణాలో సీఎం కావాలని తిరుగుతుందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీలో మూడు రాజధానుల పంచాయితీ నడుస్తుందని, అమరావతికి జగన్, రాయలసీమకు షర్మిల, కోస్తా ఆంధ్రకు విజయసాయిరెడ్డి సరిపోతారని జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు.  షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసిన తెలంగాణలో గెలవదని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటదని స్పష్ఠం చేశారు. 

కాంగ్రెస్ హయాంలో పేదప్రజలకు ఆరోగ్యశ్రీ బాగా ఉపయోగపడేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్  ఆరోగ్య శ్రీ పై చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆరోగ్య శ్రీపై స్పందించకుంటే పోరాటం చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు.  రాష్ట్రంలో ప్రాజెక్టులు కడ్తున్నారు బాగానే ఉంది కానీ ఆరోగ్య శ్రీ కూడా అవసరమేనని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బిల్స్ పెండింగ్ లేకుండా ఇచ్చేవారని తెలిపారు.