- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, వెలుగు : నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. గురువారం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన గడ్డం శివమణికి 29,500, శంకర్ కు రూ.32 వేలు, కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు రూ.44 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత, సర్పంచ్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
