
బెజ్జంకి వెలుగు: ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారమవుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ఇందిరమ్మ ఇల్లుకు భూమిపూజ చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. మండలంలో మొత్తం 412 మందికి ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. అడిషనల్కలెక్టర్మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ దామోదర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, పార్టీ మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి తదితరులున్నారు.
పీహెచ్సీ తనిఖీ
బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, పేషెంట్ వార్డు పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండి, మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. తాత్కాలిక ఉద్యోగి లక్ష్మి ఉద్యోగ విరమణ పొందగా ఆమెను సన్మానించారు.