వరంగల్/ కాజీపేట, వెలుగు: హైదరాబాద్ నగరంలో హైడ్రా మాదిరి, గ్రేటర్ వరంగల్ నగరానికి 'వైడ్రా' తీసుకురావాలని, అప్పుడే ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు సేఫ్గా ఉంటాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. మంగళవారం గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆయన 46వ డివిజన్లో బయో మైనింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్లోని మడికొండ డంపింగ్ యార్డ్ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట విలీన గ్రామాల నుంచి జనాల నుంచి అధికంగా రెవెన్యూ, స్టాంప్ డ్యూటీల రూపంలో టాక్సులు వెళ్తున్నాయని చెబుతూ బల్దియా అధికారులు విలీన గ్రామాల అభివృద్ధికి 1/3 నిధులు కేటాయించాలన్నారు.
