భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పేదొళ్ల కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో కొత్తగా సాంక్షన్ అయిన రేషన్కార్డులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో 4,633 కొత్త రేషన్కార్డులు మంజూరు అయ్యాయన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డు వస్తుందని చెప్పారు. అర్హులై ఉండి ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పాల్వంచ : మండలంలోని జగన్నాథపురం లో ఉన్న పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో మండలంలోని 1,500 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త గూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస రావు పాల్గొన్నారు.
