
బీజేవైఎం, జర్నలిస్ట్ యూనియన్ల డిమాండ్
మల్కాజిగిరి, వెలుగు: జర్నలిస్టును బూతులు తిట్టి బెదిరించిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్భానుప్రకాష్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై దాడులు పెరిగిపోయాయని, చివరకు జర్నలిస్ట్ లను కూడా వదలడం లేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మల్కాజిగిరి చౌరస్తాలో బీజేవైఎం, బీజేపీ, జర్నలిస్ట్ సంఘ నాయకులు ఆందోళన చేశారు. అక్రమాలను బయటపెట్టిన జర్నలిస్టును బెదిరించిన ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి, నాయకులు శేఖర్ యాదవ్, బక్క నాగరాజు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి: ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కూకట్పల్లి దళిత బహుజన జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో హైదర్నగర్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. ఫోరం అధ్యక్షుడు ఎన్. రవీందర్, ఉపాధ్యక్షుడు మహేందర్, కోశాధికారి బుల్లెట్ రవి, ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం ఉన్నారు.
ఉప్పల్: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యులు తిరుపతిరెడ్డి, చంద్రమౌళి, వెంకట్రామిరెడ్డి, సురేష్ పాల్గొన్నారు.
For More News..