ఇదేం విడ్డూరం.. తనకు తానే పాలభిషేకం చేసుకున్న ఎమ్మెల్యే

ఇదేం విడ్డూరం.. తనకు తానే పాలభిషేకం చేసుకున్న ఎమ్మెల్యే

ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే ఏం చేస్తాం.. ఆ పని చేసిన నాయకుడికి పాలభిషేకం చేసి లబ్ధిదారులు గుర్తు చేసుకుంటారు. కానీ పని చేసిన వ్యక్తే స్వయంగా పాలభిషేకం చేసుకుంటే.. అలాంటి సంఘటనే రాష్ట్రంలో జరిగింది. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ఆర్టీసీ ఉద్యోగులంతా సీఎం కేసీఆర్ పటానికి పాలభిషేకం చేయాలని నిర్ణయించారు. 

ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కార్మికులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతు సీఎం కేసీఆర్ పటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. అదే ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో ఉంది. 

అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఎమ్మెల్యే పాల గ్లాసు అందుకున్నారు. తాను ఉన్న ఫొటోకి స్వయంగా పాలభిషేకం చేశారు. ఇది చూసిన కార్మికులు నివ్వెర పోయారు. 

ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యే ఫొటో ఉన్నప్పుడు కార్మికులు అభిమానం తెలియజేస్తే ఓ అందం చందం ఉండేది.. స్వయాన ఎమ్మెల్యేనే తన ఫొటోకి క్షీరాభిషేకం చేసుకోవడం ఏంటో అని ముక్కున వేలేసుకుంటున్నారు చూసిన వారు. మీకేనపిస్తోంది మరి?