
-
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు
చందానగర్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి సెగ్మెంట్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం నాయు డు పిలుపునిచ్చారు. గురువారం మియాపూర్లోని బీజేపీ ఆఫీసులో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. శేరిలింగంపల్లి ఇన్చార్జి గజ్జల యోగానంద్తో కలిసి మునిరత్నం చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి శేరిలింగంపల్లిలో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు. యోగానంద్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి సెగ్మెంట్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
కార్యకర్తలు, నాయకులంతా నిరంతరం ప్రజా సేవలో ఉంటూ పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.