హైదరాబాద్ : మల్కాజిగిరి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుకు కొద్దిలో ప్రమాదం తప్పింది. చిక్కడపల్లిలోని సాయికృప హోటల్ లో ఆయన ఈ మధ్యాహ్నం ఫంక్షన్ కు అటెండయ్యారు.
ఆయన ప్రయాణిస్తున్న లిఫ్ట్.. మొదటి అంతస్తు నుంచి పడిపోయింది. ఈ సంఘటనలో MLA హనుమంతరావు కాలుకు చిన్నపాటి గాయం అయ్యింది. ఆయనను యశోద హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించారు.