ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి : పి.సుదర్శన్ రెడ్డి

ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి : పి.సుదర్శన్ రెడ్డి
  • ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి 

బోధన్, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సొమవారం బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి హాస్పిటల్ హాలులో టెన్త్, ఇంటర్​లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు, శాలువాలతో సత్కరించారు. ప్రైవేటు స్కూల్, కాలేజీలు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనరల్ హాస్పిటల్ కోసం భూమి పూజ చేశారు.   

టెన్త్​ టాపర్​ క్రితికి సన్మానించిన ఎమ్మెల్యే

నిజామాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షలో రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులు సాధించిన సిర్ప క్రితిని బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి నగరంలోని ఆయన ఇంట్లో సోమవారం సన్మానించారు.  క్రితి 596 మార్కులు పొందడం ఆషామాషీకాదన్నారు. స్టూడెంట్​ను తీర్చిదిద్దిన కాకతీయ ఒలంపియాడ్​ స్కూల్​ మేనేజ్​మెంట్​ను అభినందించారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్​ తాహెర్​, స్కూల్​ డైరెక్టర్​ సీహెచ్​రజినీకాంత్​, ప్రిన్సిపాల్​ ఎండి.ఫరీదుద్దీన్, డాక్టర్​ కృష్ణ ఉన్నారు.

చదువులో మరింత ఉన్నతంగా రాణించాలి

కామారెడ్డిటౌన్​, వెలుగు ఎస్సెస్సీ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.   జిల్లాలో మహాత్మ జ్యోతిబాపూలే   రెసిడెన్సియల్​ స్కూల్​లో అత్యధిక మార్కులు సాధించిన  స్టూడెంట్స్​ను సోమవారం కలెక్టర్​ సన్మానించారు. బామన్​ రమేశ్​ (మార్క్​లు  587), పైడి మౌర్యానాంద్​రెడ్డి ( 581).  ఛైతన్య ( 570 ),  శివ ( 576),  అనిరుద్​ ( 572),  ఎం. రక్షిత ( 579) లను కలెక్టర్​
 సన్మానించారు.