
బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని శక్కర్నగర్, పాన్గల్లి, రాకాసిపేట్ ప్రాంతాల్లో బుధవారం ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చుతుందన్నారు. లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5లక్షల సాయం అందనుందన్నారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బీన్ హందాన్, గ్రంథాలయ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పద్మశరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, తహసీల్దార్ విఠల్, ఏసీపీ పి.శ్రీనివాస్, మున్సిపల్ ఏఈలు, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయాన్ని విజిట్ చేసిన ఎమ్మెల్యే
ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విజిట్ చేశారు. ఎంపీడీవో శంకర్అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని పలు ప్రశ్నలు అడుగగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
లింగంపేట మండల కేంద్రంలో..
లింగంపేట, వెలుగు : లింగంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు భూమిపూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన15 నెలల వ్యవధిలోనే పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, కరెంట్ షాక్తో చనిపోయిన బాధిత కుటుంబీకులకు పరిహారం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
అంతకు ముందు మండలంలోని పర్మల్ల గ్రామంలో పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్కో డీఈఈ విజయసారథి, ఏడీఈ చీకోటి మల్లేశం, ఎంపీడీవో నరేశ్,మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్ జొన్నల రాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్, నాయకులు వంజరి ఎల్లమయ్య, అట్టెం శ్రీనివాస్, ప్రసాద్ గౌడ్, బాలాగౌడ్ పాల్గొన్నారు.