మల్లన్న కల్యాణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

మల్లన్న కల్యాణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

కొమురవెల్లి, వెలుగు: ఈనెల7న జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ ఏర్పాట్లను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. శుక్రవారం కొమురవెల్లిలో తోటబాయి వద్ద కల్యాణ వేదికను, రాజగోపురం ముందు క్యూలైన్లను, పార్కింగ్ ప్రదేశాలను అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావుతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మల్లన్న కల్యాణ ఉత్సవాన్ని ఉజ్జయిని పీఠాధిపతి శ్రీ 1008 జగద్గురు సిదలింగరాజదేశి కేంద్ర శివాచార్య మహాస్వామీజీ పర్యవేక్షించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారి ఆభరణాలను శుభ్రం చేశారు. ఎమ్మెల్యే పల్లావెంట ఆలయ ఈవో బాలాజీ, చేర్యాల సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ నాగరాజు, ఏఈఓఅంజయ్య, సూపరింటెండెంట్​ శేఖర్,  ఆలయ అర్చకులు ఉన్నారు.