ప్రోటోకాల్ వివాదంపై సీఎస్ కు రఘునందన్ రావు ఫిర్యాదు

ప్రోటోకాల్ వివాదంపై సీఎస్ కు రఘునందన్ రావు ఫిర్యాదు

హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దీనిపై హైదరాబాద్ బీర్కే భవన్ లో సీఎస్ సోమేష్ కుమార్ ని రఘునందన్ రావు కలిసి కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అభివృద్ధి కార్యక్రమాల్లో శిలాఫలకాలపై తమ పేర్లు పెట్టకుండా అధికార పార్టీ నేతల పేర్లు పెడుతున్నారని సీఎస్ కు వివరించామని చెప్పారు. దీనిపై త్వరలోనే అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇద్దరు స్పందించకపోతే కోర్టుకు వెళతామన్నారు. దుబ్బాక అభివృద్ధి పనుల్లో ప్రొటోకాల్ రగడ చోటు చేసుకుంది. శిలాఫలకంపై తన పేరును పెట్టకపోవడంపై   ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా పరిస్థితి మారిపోయింది.

మరిన్ని వార్తల కోసం...

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రీడా స్ఫూర్తిని మరచింది

గాడిదల పరుగు పందెం

V6 న్యూస్ చానెల్ కు జాతీయస్థాయి అవార్డు