బండి సంజయ్ పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తాం: రఘునందన్ రావు 

బండి సంజయ్ పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తాం: రఘునందన్ రావు 

సిద్దిపేట జిల్లా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు అనుమతులు ఇచ్చి చివరి నిమిషంలో పోలీసులు రద్దు చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. రాష్ట్ర హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం అని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజలను కలుసుకోకూడదని సీఎం కేసీఆర్ ఆలోచన విధంగా ఉందన్నారు. పాదయాత్ర ద్వారా తప్పనిసరిగా ప్రజల వద్దకు వెళ్లి..వారి బాధలను తెలుసుకుంటామని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు రక్షణ కల్పిస్తారో..? లేదో తేల్చుకోవాలి..? అంటూ సవాల్ విసిరారు. లక్షలాది మంది పోలీసులు ఉండి పాదయత్రకు అనుమతివ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. 

18వ శతాబ్దంలో మహిళల హక్కులు, విద్య కోసం తమ జీవితాలను పూలే దంపతులు త్యాగం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.1848లో సావిత్రి భాయి పూలే మహిళల విద్య కోసం పాఠశాల ప్రారంభించిన గొప్ప వ్యక్తులని అన్నారు. పూలే దంపతుల ఆశయాలు నెరవేరాలంటే మహిళలందరికీ సమాన హక్కులు, సమాన విద్య,రాజ్యాధికారం వచ్చిన రోజే వారికి నిజమైన నివాళి దక్కుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.