ఈటల గెలుపు కేసీఆర్‌కు లైఫ్ టైం గుర్తుండాలి

ఈటల గెలుపు కేసీఆర్‌కు  లైఫ్ టైం గుర్తుండాలి

30న జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో ఇంటిలిజెన్స్ అంచనాలు తలకిందులు చేస్తూ.. ఈటల భారీ మెజారిటీతో గెలవబోతున్నారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. మరో రెండ్రోజులు ఈటలను కాపాడుకుంటే.. చరిత్ర సృష్టిస్తారన్నారు. ఈటల గెలుపు కేసీఆర్ కి లైఫ్ టైం గుర్తుండాలన్నారు. ఏప్రిల్ 27న పెట్టాల్సిన ప్లీనరీ ఇప్పుడు పెట్టారంటేనే ఈటల గెలుపుని అంగీకరించినట్లు అని చెప్పారు.  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆబాదీ జమ్మికుంటలో బీజేపీవైఎం ఆధ్వర్యంలో జరిగిన యువ సమ్మెళనంలో మాట్లాడారు.