సైబర్ నేరాల అడ్డుకట్టకు ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’..తెలియని లింకులు క్లిక్ చేయొద్దు: ఎస్పీ జానకీ షర్మిల

సైబర్ నేరాల అడ్డుకట్టకు ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’..తెలియని లింకులు క్లిక్ చేయొద్దు: ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్, వెలుగు: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యం చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ అనే ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్మల్​ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించే పోస్టర్‌ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్‌వర్డ్​లు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.

 అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ఫోన్ ద్వారా వచ్చిన అటాచ్‌మెంట్‌లను తెరవవద్దన్నారు. డిజిటల్ అరెస్ట్, బెదిరింపుల గురించి భయపడవద్దన్నారు. సైబర్​ మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా  1930కు అలాగే  tgcs b.p olice.gov.in వెబ్​సైట్​లోని చాట్​బాట్​కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్​చార్జ్ వెంకట రమణ, ఆర్ఎస్సై శ్రావ ణి, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.