TRS ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది

TRS ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది

హైదరాబాద్  గచ్చిబౌలి  పరిధిలోని  గోపన్ పల్లి  గ్రామ సర్వే  నంబర్  37లో ఉన్న గుడిసెలు కుల్చివేసిన  ప్రాంతాన్ని దుబ్బాక  ఎమ్మెల్యే రఘునందన్ రావు  పరిశీలించారు. TRS ప్రభుత్వం రియల్  ఎస్టేట్ వ్యాపారం  చేస్తోందని అన్నారు  ఎమ్మెల్యే రఘునందన్. 30 సంవత్సరాలుగా  ఉంటున్న ప్రజల  గుడిసెలు తోలగించి  వారి బతుకులను  రోడ్డు పాలు చేశారన్నారు.  ప్రతి సమస్యను  ట్విట్టర్ లో   పరిష్కరించే పురపాలక శాఖ  మంత్రి కేటీఆర్  కంటికి ఈ సమస్య  కనిపించలేదా అని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీ పేద  ప్రజలకు అండగా పోరాడుతుందన్నారు.  న్యాయం జరిగేలా  చూస్తామని  హామీ ఇచ్చారు.