సీఎం కేసీఆర్ దారిలోనే మంత్రి కేటీఆర్  

సీఎం కేసీఆర్ దారిలోనే మంత్రి కేటీఆర్  

సీఎం కేసీఆర్  మార్గదర్శంలోనే మంత్రి కేటీఆర్  నడుస్తున్నాడని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా వ్యవహరించే కేసీఆర్ అలవాటు కేటీఆర్ కు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి  మంత్రి కేటీఆర్ కు పంపిన వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ ను మీడియాకు పంపారు రాజాసింగ్. నియోజకవర్గం సమస్యలపై కేటీఆర్ ను కలవాలని వందల సార్లు ప్రయత్నించినా స్పందన లేదన్నారు.

సమస్యలపై తనను కలవాలని అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ చెప్పారన్న ఎమ్మెల్యే రాజాసింగ్..ఇచ్చిన మాటను తప్పారన్నారు. ఎంఐఎం నేతల మాదిరి భూముల సెటిల్మెంట్ల కోసం మాకు సమయం అవసరంలేదని.. గోషామహాల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే తనకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు.